గుండాల డిసెంబర్ 31 (మన్యం మనుగడ) చేతన ఫౌండేషన్ సేవలు అభినందనీయమని గుండాల సీఐ కరుణాకర్ అన్నారు. శుక్రవారం చేతన పౌండేషన్ సభ్యులు ఉపాధ్యాయుడు సతులాల్ మండలంలో అనేక సేవా కార్యక్రమాలను చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సేవా కార్యక్రమాలలో సత్తు లాల్ ని ఆదర్శంగా తీసుకొని మరికొందరు ముందుకు రావాలని ఆయన కోరారు. ఇందులో భాగంగా దివ్యాంగులకు ట్రై సైకిల్స్ వీల్ చైర్ తో పాటు తోపుడు బండిని వారికి అందజేశారు .ఈ కార్యక్రమంలో గుండాల ఎస్ ఐ సురేష్ , ఫౌండేషన్ సభ్యులు సత్తు లాల్, చంద్ర కాని నవీన్, షేక్ రషీద్, సత్యనారాయణ, పగడయ్య , సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: