మన్యం మనుగడ, పినపాక :
పినపాక మండలంలోని తోగ్గూడెం పంచాయతీ గోపాలరావు పేట గ్రామానికి చెందిన కోళ్ల పెద్దిరాజు ప్రమాదానికి గురై గత కొంత కాలంగా మంచానికి పరిమితమయ్యారు.అతని వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేని స్థితిలో ఆ కుటుంబం ఉంది . వైద్య ఖర్చుల నిమిత్తం తోగ్గూడెం ఎంపీటీసీ చింతపంటి సత్యం 2000, గ్రామ పెద్దలు 2000, 20 కేజీల బియ్యాన్ని ఆర్థిక సహాయం కూడా అందించారు. ఈ కార్యక్రమంలో తోగ్గూడెం ఉపసర్పంచ్ బుస్సి శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ సభ్యులు సూర నరసింహారావు, ఊడుగుల రామచంద్రు, కొంపెల్లి మల్లేష్, కొంపెల్లి నాగేశ్వరరావు, కూనారపు సత్యనారాయణ, గోరంట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు
Post A Comment: