ములకలపల్లి: న్యూస్: డిశంబర్29:.మన్యం మనుగడ: మండలం లోనిపాత గంగారం గ్రామంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవం లో టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ బుధవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ వాడే లక్ష్మీ, గ్రామ పెద్దలు సాదరంగా ఆహ్వానించారు.ముందుగా ముత్యాలమ్మ అమ్మవారి దగ్గర పూజలు నిర్వహించి,ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వారితో ఆడిపాడుతూ బొడ్రాయి ప్రతిష్టించిన ప్రదేశం లో నవధాన్యలు వేసి పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా జారే ఆదినారాయణ మాట్లాడుతూ గ్రామం చల్లగా ఉండాలని,గ్రామంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలతో గ్రామం తులతూగలని గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించార
రూ.ఈ కార్యాక్రమంలో సర్పంచ్ లు కారం సుధీర్, సున్నం సుధాకర్, కేసరి శ్రీను, టీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు సర్దార్, వాడే బోజ్జి,గ్రామస్తులు వాడే వీరభద్రం,స్థానిక సర్పంచ్ వాడే లక్ష్మీ, శేషగిరి,కోటి,తాటి వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: