మన్యం టీవీ మంగపేట
మంగపేట మండలం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్థాయి నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం కార్యక్రమం చేపట్టారు.కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం నమోదు కార్యక్రమం పై కార్యకర్తలకు వివరిస్తూ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రెండు లక్షల ప్రమాద బీమా ఇన్సూరెన్స్ పాలసీ వర్తిస్తుందని తెలియజేయడం జరిగింది మరియు గ్రామాలలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని వివరించడం జరిగింది.మండలమువ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో ఉన్న నాయకులు సభ్యత్వ నమోదు అధిక మొత్తంలో చేయుటకు బూత్ ఎన్ రోలర్ లకు సహకరించి సభ్యత్వ నమోదు అధిక సంఖ్యలో చేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి ,మండల ఉపాధ్యక్షుడు తూడి భగవాన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అయ్యో రీ యణయ్య, మైప లాలయ్య, కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చిలకమర్రి శ్రీనివాస్,బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఆదినారాయణ, సీనియర్ నాయకులు దీకొండ కాంతారావు,చిన్న పెళ్లి రాంబాబు, చిన్న పల్లి స్వామి బసని కారి నాగార్జున పూజారి రాజాలు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: