చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : పల్లె ప్రకృతి వనాలతో పల్లెల్లో పచ్చని అందాలు వెల్లువిరుస్తాయని జడ్పీటీసీ కొణకండ్ల వెంకట రెడ్డి అన్నారు.మంగళవారం తిప్పనపల్లి పంచాయతీ పరిధిలోని మహ్మద్ నగర్ గ్రామంలో ఉపాధిహామీ పధకంలో చేపట్టనున్న బృహత్ పల్లెప్రకృతివనం పనులకు ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నేడు అంతరించిపోతున్న వనాలను పల్లెప్రకృతి వనాలతో రక్షించాలని, అధికారులు అందుకు తగ్గ ప్రయత్నం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దరావత్ పార్వతి, ఎంపీటీసీ లంకా విజయలక్ష్మి, ఉప సర్పంచ్ ధారావత్ రామారావు, మండల పంచాయతీ అధికారి తోట తులసిరామ్, జి పి సెక్రెటరీ లక్ష్మీనారాయణ, ఏపీవో శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు నరసింహారావు, జాకీర్, లాల్అహ్మద్, పిర్ అహ్మద్, యాకూబ్, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: