మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట పట్టణంలో సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న క్రిస్మస్ కానుకలను సోదర సోదరీమణులకు ఎంఎల్ఎ మెచ్చా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే. మెచ్చా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చెన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లి పెళ్లి శ్రీరామ్మూర్తి, మండల అధ్యక్షులు బండి పుల్లారావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జూపల్లి రమేష్, అశ్వరావుపేట సర్పంచ్ అట్టం రమ్య, ఊట్లపల్లి సర్పంచ్ సాధు జోత్స్నా బాయ్, సీతారాం తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: