మన్యం టీవి ప్రతినిధి:
కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండల పరిధిలోని ఎడవల్లి కృష్ణ
టిపిసిసి సభ్యులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ఉచిత బీమా ను మండలంలోని ప్రతి ఒక్క కార్యకర్త సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులు గద్దల రమేష్ కోరారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మండలలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు 2,00,000 ప్రమాద బీమా పార్టీ కల్పిస్తుందని, బూతు స్థాయి బాధ్యులు గ్రామంలో గల ప్రతి ఒక్క కార్యకర్తను కలుస్తూ, సభ్యత్వ నమోదు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రయోజనాలను తెలియజేయాలని పేర్కొన్నారు.
మండలం లోని సభ్యత్వ నమోదు కార్యక్రమం రికార్డు స్థాయిలో చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని తెలిపారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Post A Comment: