ములకలపల్లి:మన్యం మనుగడ:
న్యూస్:మండలంలో ని
పాత గంగారం గ్రామ పంచాయతీ లో గల బొడ్డు రాయి ప్రతిష్ట కార్యక్రమంలో ములకలపల్లి జెడ్పిటిసి,టీపీసీసీ సెల్ మెంబెర్ సున్నం నాగమణి పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు.మొదటి రోజు పూజ కార్యక్రమాలు,మంగళ వాయిద్యాలతో గ్రామతోరణం,
పుణ్యహ వచనం,గణపతి పూజ,దీక్షా ధారణ,అఖండ దీప స్థాపన,పరియగ్ని కరణం,యాగశాల ప్రవేశం,ప్రధాన దేవతల అవహనం,జలది వాసం,నవగ్రహ హోమం,తీర్థ ప్రసాదాల వినియోగం.జరిగాయి అంతకు ముందు స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ వాడే లక్ష్మీ అద్వర్యం లో ఎంపిటిసిమడకం విజయ, జగన్నాధపురం ఎంపిటిసి సున్నం సునీత,వాడే శేషగిరి మరియు కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ అధ్యక్షుడు పుష్పాల హనుమంతరావు,ఎస్టీ సెల్ అధ్యక్షుడు కనితి సత్యనారాయణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: