CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి:AIKMS డిమాండ్.

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్: వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అఖిలభారత రైతుకూలి సంఘం కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి నాయని రాజు, కొమరారం ఎంపీటీసీ అజ్మీర బిచ్చా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారంనాడు అఖిలభారత రైతుకూలి సంఘం, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రతినిధి బృందం కొమరారం లో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు పరిస్థితిని పరిశీలించారు వారాల తరబడి రైతులు కల్లాల వద్ద ఎదురుచూపులు చూస్తున్నారని ఎండకు వానకు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ నిద్ర,ఆకలి,ఎండలోఇబ్భందులు పడుతున్నారని, ప్యాడీ క్లీనింగ్ సమస్య, ట్రాన్స్పోర్ట్ సమస్య అక్కడ ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ పరిస్థితి అంతా విన్న అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం శోచనీయం. ఇప్పటికైనా వెంటనే ఈ సమస్యలు పరిష్కరించకపోతే, ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోAIKMS మండల కార్యదర్శి బుర్ర వెంకన్న, వై సావిత్రి, ఈసం భద్రయ్య కాన్ పార్టీ ప్రసాద్ గంగాధర భాస్కర్, గుర్రం యాదగిరి, శాంతయ్య, జాన్ బాబు తదితర రైతులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: