మన్యం వెబ్ డెస్క్ ,న్యూ ఢిల్లీ:
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ ను న్యూఢిల్లీలోని తన నివాసంలో మాదిగ జేఏసీ రాష్ట్ర రాష్ట్ర ప్రచారకార్యదర్శి గద్దలనాగేశ్వరరావు కలిసి వినతిపత్రం అందించారు
పదేండ్ల యూ పి ఏ పాలనలో మాదిగలకు అన్యాయం జరిగిందని, అధికారంలోకి వస్తే వందరోజుల్లోనే ఎస్సీ రిజర్వేషన్ ల సమస్య కు శాశ్వత పరిష్కారం చూపుతూ చట్టం తెస్తామని మాదిగలను నమ్మబలికి అధికారం లోకి వచ్చాక మోసం చేసిన బీజేపీ పార్టీని నిలదీసి కాంగ్రెస్ మాదిగలకు చేసిన ద్రోహాన్ని తుడుచుకోవాలని కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి మాదిగలకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ మాదిగ ఉద్యమంలో అమరులైన మాదిగ యువత గురించి ఆలోచించకపోవడం విచార కరమని ఆవేదన చెందారు దీనికి స్పందించిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు మాదిగల న్యాయ పోరాటానికి అండగా నిలిచి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని హామీ ఇవ్వడమే కాక వ్యక్తిగతంగా నేను మాదిగల న్యాయ పోరాటానికి మద్దతుగా ఉంటానని హామీ ఇచ్చారు రాష్ట్రాలకు ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ లను జనాభా ప్రాతిపదికన విభజించే హక్కు కల్పిస్తూ పార్లమెంట్ లో చట్టం తెచ్చేలా కృషి చేస్తే మాదిగలకు 12% రిజర్వేషన్ దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ మాదిగల పక్షాన నిలబడి పార్లమెంట్ లో చట్టం తేవడానికి కృషి చేస్తానని చెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు మాదిగ జేఏసీ వేదికగా డా,, పిడమర్తి రవి నాయకత్వం లో రాష్ట్ర కన్వీనర్ ధీరన్ నేతృత్వంలో మాదిగల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని తెలిపారు
Post A Comment: