మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని అఖి నేపల్లి మల్లారం ఎస్టీ కాలనీలో గురువారం ఇసుక క్వారీ నిర్వ హణకు అక్కడి గ్రామస్తుల తో ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ సభను డిఆర్ఓ రమాదేవి తహశీల్దార్ బాబ్జి ప్రసాద్ ఎంపీడీఓ శ్రీధర్ ఎంపీఓ శ్రీకాంత్ ఈ ఈ పిసిబి వెంకటనర్సు రఘు బాబు మైన్స్ ఏడి శ్రీ కాంత్ గ్రౌండ్ వాటర్ నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణలో అ క్కడి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని క్వారీ నిర్వహణకు తమ మద్దతిని తెలిపారు.సభలో గ్రామస్తులు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీధర్ వర్మ,జాతీయ మిర్చి టాస్క్ఫోర్స్ డైరెక్టర్ సాం బశివ రెడ్డి,మాల మహానాడు ఎస్సి ఎస్టీ మానిటరింగ్ సభ్యు డు సుకుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామంలో ఇసుక క్వారీ నిర్వహణకు ఎటువంటి అభ్యంతరం లేదని క్వారీ నిర్వహణతో గిరిజన ప్రజలు అభివృద్ధి చెందాలని సూచించారు.ఈ కార్య క్రమంలో గ్రామ కార్యదర్శి శ్రవణ్ కుమార్,ప్రత్యేక అధికారి విజ యలక్ష్మి,గ్రామస్తులు పాల్గొ న్నారు.
Post A Comment: