CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్.ఆరుగురు మహిళా మావోయిస్టులు మృతి

Share it:

 


 

 


 మన్యం టీవీ చర్ల: 


తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు నడుమ భీకర కాల్పులు జరిగాయి. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండల పర్ణశాల పోలీస్‌స్టేషన్‌ బోర్డర్‌కి చేరువలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కిష్టారం సమీప దోరగూడ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లుగా సమాచారం.

మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహాండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులకు, మావోయిస్టులకు నడుమ ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.‌ ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా, మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నట్టు సమాచారం. చర్ల ఎల్‌వోఎస్ కమాండర్ మధు మృతుల్లో ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం. సంఘటన ప్రాంతంలో ఆరు ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.‌ ఈ ఎన్‌కౌంటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారులు ప్రకటించాల్సి ఉంది.

Share it:

TS

Post A Comment: