మన్యం మనుగడ, పినపాక:
తెలంగాణ ప్రభుత్వం వైపు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కంటి సమస్యతో బాధపడుతున్న వారి కోసం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం, చత్ర చికిత్సలు అవసరం అయ్యే వారిని హైదరాబాద్ కు పంపించడం, రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదల జీవితాల్లో వెలుగు నింపడం ఒక మహత్కార్యము అని, పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ అన్నారు. బుధవారం నాడు మణుగూరు లోని వంద పడకల ఆసుపత్రి నందు నిర్వహించిన నేత్ర వైద్య శిబిరాన్ని ఉద్దేశించి, రేగా కాంతారావు చేస్తున్న సేవలను పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ కొనియాడారు. పినపాక నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా పట్టం కట్టినప్పుటి నుంచి, ఏదో రకంగా వారికి సేవలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేత్ర వైద్య శిబిరం ద్వారా జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు.
Post A Comment: