మన్యం మనుగడ డిసెంబర్ 29.
(గాస్పల్ ఫర్ ట్రైబల్ సోషల్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ) ఖమ్మం వారిచే, ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోగల బొల్లారం గ్రామం నందు జి టి ఎస్ ఎస్ ఎస్ చైల్డ్ కేర్ సెంటర్ నందు 72 మంది నిరుపేద విద్యార్థులకు స్థానిక మండల ఎంపిపి. శ్యామల శారద చేతుల మీదగా అందించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి గ్రామాల్లోని పేద విద్యార్థులకు చైల్డ్ కేర్ సెంటర్ ను స్థాపించి వారికి సహాయం చేయడం నిజంగా ఎంతో గొప్ప విషయాన్ని గుర్తుచేశారు. ఇంకా అనేక గ్రామాల, పేద విద్యార్థులను గుర్తించి ఇటువంటి సేవా కార్యక్రమాలను చేయాలని సూచించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న జి టి ఎస్ ఎస్ ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులను అభినందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ శ్యామల శారద మరియు వార్డు నెంబర్ కె. కుమారి నవీన్ పాస్టర్ శ్యామ్ సంస్థ ప్రతినిధులు మురళి రెడ్డి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: