మన్యం టీవీ ములుగు.
ములుగు జిల్లా, తడ్వాయి మండలం, కామరాం గ్రామ శివారులో గల మూల మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం కొండాయిగూడెం గ్రామానికి చెందిన బోయిల్ల సంతోష్ (23) భార్య నాగజ్యోతి ఒక కుమార్తె 2నెలల వయసు. సంతోష్ అనే వ్యక్తి తాడ్వాయి మండలం కాటాపూర్ లో పెళ్ళికి వెళ్లగా వెళ్లిన వ్యక్తిని తన బంధువు ఒకతను తనను మోతెలో దించమని కోరగా అతని ద్వి చక్ర వాహనం మీద అతనిని మోతెలో దింపి తిరిగి కాటాపూర్ వెళ్తున్న క్రమంములో కామరం గ్రామ శివారులో గల మూల మలుపులో కాటాపూర్ నుండి కరకాగూడెం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఒకటి ఎదురుగ వచ్చి డీ కొట్టడంతో ద్వి చక్ర వాహనం మీద ప్రయాణిసిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది అని అక్కడ ఉన్న ప్రజలు, పోలీస్ అధికారులు నిర్ధారణ చేసినారు.అతి వేగం, దీనికి తోడు వేగ నియంత్రణ సూచికలు లేకపోవడమే ఇందుకు గల కారణం అని అక్కడ ఉన్న ఊరు ప్రజలు వాపోతున్నారు.ఇదివరకు ఇలాంటి ప్రమాదాలు చాలా సంబవించాయి ఇప్పటికి అయినా ప్రమాదాలు జరగకుండా తగు నియంత్రణ జాగ్రత్తలు, సూచికలు, ప్రమాదం నియంత్రణకు సంబందించిన తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా అధికారులను ప్రజలు కోరారు.
Post A Comment: