CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్బంగా గిరిజన ఆశ్రమం విద్యార్థుల ర్యాలీ.

Share it:

 


మన్యం టీవీ మంగపేట.


మండలం లోని బ్రాహ్మణపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో జరిగినటువంటి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం కార్యక్రమం రేగా పాపయ్య అధ్యాపకులు అధ్యక్షతన ప్రజలకు ఎయిడ్స్ వ్యాధి గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో విద్యార్థులకు మరియు అధ్యాపకులు నినాదాలు చేస్తూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ అధికారిణి ట్వింకిల్ నిఖిత ముఖ్య భూమిక పోషిస్తూ ఎయిడ్స్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ఉద్దేశించి వ్యాఖ్యానించారు. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం రోజు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజల్లో గట్టిగా అందే విధంగా వారికి తెలియజేయాలని తగు జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు.

ఎటువంటి రోగాలు అయినా తట్టుకొనే శక్తి మనం తీసుకొనే పోషకహారం మీద ఆధారపడి ఉంటుంది సమయానికి మందులు వేసుకుంటూ మంచి పౌష్టికహారం తీసుకుంటూ ఎయిడ్స్ ఉన్న వారు సైతం ఎక్కువ కాలం జీవించవచ్చు అని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో అధ్యాపకులు, ఏ యన్ ఎం లు, గ్రామ ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: