CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలి.

Share it:

 



 మన్యం మనుగడ వాజేడు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినోత్సవం సందర్భంగా వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు, ఈ సందర్భంగా డిప్యూటీ డి ఎం హెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ,సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ఏ ఆర్ టి, మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చే ఋగ్మతలను నయం చేసే మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం, హైపర్ టెన్షన్ లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక, నియంత్రించటానికి , వీలు కలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారూ. ప్రపంచ దేశాలలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినోత్సవ సందర్భంగా ఆయన తెలియజేశారు. కార్యక్రమం లో డాక్టర్ యమున, సూర్య ప్రకాష్ రావు. సిహెచ్, కోటిరెడ్డి హెచ్ ఎస్, శరత్ ఏఎన్ఎం ఆశా వర్కర్లు, వాజేడు జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: