చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: మండల పరిధిలోని బెండాలపాడు గ్రామానికి వెళ్లే రహదారి పై నిర్మించిన రైల్వేబ్రిడ్జి తక్కువ ఎత్తులో నిర్మించారని సిపిఎం మండల కార్యదర్శి ఐలూరి రామిరెడ్డి ఆరోపించారు. బుధవారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానికులతో కలిసి రైల్వేబ్రిడ్జి వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగూడెం నుండి సత్తుపల్లి వరకు నిర్మిస్తున్న రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా చండ్రుగొండ నుండి బెండాలపాడు గ్రామానికి వెళ్లే రహదారిపై నిర్మించిన రైల్వేబ్రిడ్జి వల్ల గడ్డి టాక్టర్లు, రైతుల ఎడ్లబండ్లు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నూతనంగా బ్రిడ్జిని నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: