CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు మండలం లో ఇంటింటికి కెసిఆర్,గ్రామ గ్రామానికి టిఆర్ఎస్: ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు.ప్రజా సమస్యల పరిష్కారం దిశగా విప్ రేగా అడుగులు.

Share it:



  • దమ్మక్క పేట,సాంబయి గూడెం పంచాయతీలలో విస్తృత పర్యటన
  • జననేతకు అడుగడుగున ఘన స్వాగతం పలికిన ప్రజలు



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలో *ఇంటింటికి కెసిఆర్,గ్రామ గ్రామానికి టిఆర్ఎస్* కార్యక్రమం లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోమవారం దమ్మక్క పేట,సాంబయి గూడెం పంచాయతీలలో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా అడుగడుగున విప్ రేగా కాంతారావు కు ప్రజలు ఘన స్వాగతం పలికారు.గ్రామాల్లో నెలకొన్న సమస్యలను విప్ రేగా కాంతారావు స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకొని, సంబంధిత అధికారులతో మాట్లాడి,సమస్యలను వెంటనే పరిష్కరించారు.దమ్మక్క పేట, చిక్కుడు గుంట గ్రామాలలో ప్రజలు త్రాగునీరు సరిపోవడం లేదు అని,అదనంగా త్రాగు నీటిని ఇవ్వాలని కోరగా, అధికారులతో మాట్లాడివెంటనే సమస్యను పరిష్కరించారు. అలాగే నూతన కరెంటు లైన్లు, విద్యుత్ స్థంబాలను ఏర్పాటు కు ప్రజల విన్నవించగా ఏ ఈ వేణుగోపాల్ ను మాట్లాడి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని తెలిపారు.పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని కోరగా, త్వరలోనే పోడు భూములకు పట్టాలను అందజేస్తామని ఎవరు అధైర్య పడవద్దని వారికి భరోసా కల్పించారు.ఈ సందర్భంగా పలు కుటుంబాల ను విప్ రేగా పరామర్శించి, వారికి ధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నరసింహారావు,ఎంపీపీ కారం విజయ కుమారి, పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, స్థానిక సర్పంచులు రాంబాబు, కాయం.తిరుపతమ్మ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,డి ఈ మహేందర్ రెడ్డి,ఐటీడీఏ ఏఈ దీపాంజలి,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అరుంధతి,ఎలక్ట్రికల్ ఏఈ వేణుగోపాల్,ఎంపీఓ పి. వెంకటేశ్వర్లు,ఏ ఈ ఓ హారిక, ఆర్ ఐ,ఏ పీ ఓ అహ్మతుల్లా, స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,మహిళా కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: