చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: మండల పరిధిలోని రేపల్లెవాడ భక్తాంజనేయ ఆలయంలో ఇరుముడి కార్యక్రమం శుక్రవారం అయ్యప్ప భక్తులు నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అన్నదాన కార్యక్రమాన్ని ప్రముఖులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజేష్ కుమార్, ఎంపీపీ బానోత్ పార్వతి, సర్పంచ్ కాక శీను, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా బాబు, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు,సీనియర్ నాయకులు దారా రత్నాకర్, సూర వెంకటేశ్వర్లు, వంకాయలపాటి బాబురావు, భానోత్ రాముడు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: