చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ స్టేట్ నోడల్ అధికారి నిరంజన్ బుధవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, వైద్య సిబ్బంది రోగులతో ప్రవర్తన, వైద్యులు వైద్యం చేయు విధానాని ఆయన పరిశీలించారు. స్వయంగా రోగులతో మాట్లాడి సేవలను, వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ప్రజల్లో మంచి స్పందన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రాకేష్ కుమార్, హోమియోపతి వైద్యులు ప్రవీణ్ కుమార్, వైద్య సిబ్బంది ఇమామ్, శంకరమ్మ, పద్మ, లక్ష్మి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Post A Comment: