చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: నర్సరీ పనులను వేగవంతం చేయాలని ఎంపీడీఓ అన్నపూర్ణ అన్నారు.బుధవారం గానుగుపాడు పంచాయతీలో పరిధిలోగల నర్సరీని ఆమె పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని, జాప్యం జరిగితే సహించేదిలేదన్నారు.పంచాయి తీలలో ప్రతిరోజు పారిశుద్ధ పనులు చేయాలని, డ్రైనేజీలను శుభ్రంగా ఉంచాలన్నారు.హరితహారంలో రహదారుల వెంబడి నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో జి పి సెక్రెటరీ సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు
Post A Comment: