మన్యం టీవీ ,ఏటూరునాగారం.:
కెసిఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్ల లో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తలపెట్టిన రైతు రచ్చ బండ కార్యక్రమం కు బయలుదేరిన కన్నయిగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి సొంత పూసికత్త మీద విడుదల చేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జాడి రాంబాబు మాట్లాడుతూ ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి ఆదేశాల మేరకు రైతు రచ్చ బండ కార్యక్రమం కు వెళ్తుంటే అరెస్ట్ చేయడం దారుణం అని రైతు లు వరి వేయకుంటే ఏం చేయాలో చెప్పాలి అని డిమాండ్ చేశారు. పెసర,పల్లి, బుడ్డ శెనిగల్ ఎప్పుడో ముప్పై సంవత్సరం ల క్రితం వేసేవాళ్ళo మల్లి రైతులను పాత కాలం కు పంపుతున్నారా అని,పగలు కోతులు, రాత్రి పందుల బాధ ఉంటది అని కావాలి ఎవరు వుండాలి అని ప్రశ్నించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ మండల అధ్యక్షులు సునారికారి రాంబాబు, యూత్ మండల అధ్యక్షులు కోట నగేష్,బ్లాక్ కాంగ్రెస్ నాయకులు సుధాకర్, దుర్గం పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: