మన్యం మనుగడ, చండ్రుగొండ: అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ లో జరిగిన సెటిల్ టోర్నమెంట్ లో గెలుపొందిన వైరా జట్టుకు ప్రథమ బహుమతి రూ 10వేలను అశ్వారావుపేట నియోజకవర్గ యువ నాయకురాలు వగ్గేల పూజ అందజేశారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా విచ్చేసిన వగ్గేల పూజ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉలాసానికి ఎంతగానో ఉపయోగ పడతాయి అని,క్రీడలతో స్నేహ భావం పెంపొందుతుందన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులకు ధన్యవాదములు తెలియజేసారు. ఇటువంటి కార్యక్రమాలకి తమ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి అని ఆమె అన్నారు.
Post A Comment: