మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఇంటింటికి కెసిఆర్,గ్రామ గ్రామానికి టిఆర్ఎస్ కార్యక్రమం లో భాగంగా దమ్మక్క పేట గ్రామంలోని చిక్కుడు గుంట లో పలు కుటుంబాలను విప్,రేగా కాంతారావు పరామర్శించారు. ఈ సందర్భంగా పొనగంటి. జంగం కుటుంబ సభ్యులను పరామర్శించి,రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం.విజయకుమారి, జడ్పీటీసీ,పొశం.నరసింహారావు,స్థానిక సర్పంచ్ రాంబాబు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,యువజన నాయకులు,మహిళా కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: