మన్యం మనుగడ వాజేడు. సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో వారు స్థానిక పోలీసులను అప్రమత్తం చేసారు. ఈనేపధ్యంలో 163 జాతీయ రహదారి పై గురువారం ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో విస్తృత వాహనాల తనిఖీ చేసారు. రహదారి పై వాహన తనిఖీ చేస్తూ గుర్తుతెలియని వ్యక్తులని పూర్తి చిరునామాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ సివిల్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: