CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఐటిడిఎ పివో గా ఐఏఎస్ ను నియమించాలి.సమస్యలు పరిష్కరించడంలో ఇంఛార్జి పీవో విఫలం.

Share it:

 



మన్యం టీవీ ఏటూరు నాగారం

ఏజెన్సీ ప్రాంత ఆదివాసీల అభివృద్ధి కోసం ఐటిడిఎ లు ఏర్పాటు చేసి 45 వసంతాలు గడిచిన ఆదివాసీల స్థితి గతులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా ప్రధానకార్యదర్శి రేగ గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు.మంగళవారం ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఏ ఎం ఎస్ పి జిల్లా ప్రధాన కార్యదర్శి చేల శమంతకమణి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో రేగ గణేష్ హాజరై మాట్లాడుతూ.ఏజెన్సీ మండలాలకు ఐటిడిఎ పివో తండ్రి లాంటి వాడని అలాంటిది 5,6 నెలలు గడుస్తున్న ఆదివాసీలకు పీవో ను లేకుండా చేసిన కుట్రల వెనుక ప్రభుత్వం ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇన్చార్జిగా విధులు నిర్వర్తించడంలో కలెక్టర్ విఫలమయ్యారని ఆరో పించారు.రోజు రోజుకు ఐటీడీఏ కార్యాలయం నిర్వీర్యం అవుతుందని, ఆదివాసీల సమస్యలు ఏజెన్సీ మండలాల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయయని ఆరోపించారు.తక్షణమే పివో విధుల నిర్వహణకై ఐఏఎస్ అధికారిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్యాలయం ముందు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏ ఎస్ పి జిల్లా కార్యదర్శి పూనెం చంటి, ఏ ఎమ్ ఎస్ పి జిల్లా నాయకులు తెల్ల నాగమణి, సులోచన,మధు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: