మన్యం టీవీ.
గిరిజనుల సౌకర్యార్థం 20.12.2021 సోమవారం రోజున మంగపేట రైతు వేదిక సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పరిసర ప్రాంత గిరిజనులు వినియోగించుకోవాలని అధిక సంఖ్యలో విచ్చేసి తమ సమస్యలను విన్నవించుకోవాలి అని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు
మంగపేట లో జరుగు ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు, ఐటిడిఏ అధికారులు సకాలంలో హాజరు కావాలని అన్నారు.
ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న ప్రజావాణి కార్యక్రమానికి మంగపేట రైతువేదిక లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తహశీల్దార్ బాబ్జీ, ఎంపిడిఓ శ్రీధర్ ను ఆదేశించారు.
ఈ ప్రజావాణిలో పరిసర ప్రాంత గిరిజనులు, ప్రజలు వారి వారి సమస్యలను లిఖిత పూర్వకంగా తెలియచేస్తూ దరఖాస్తులు అందచేయాలని ఆయన తెలిపారు.
అదేవిధంగా ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యధావిధిగా ప్రజావాణి, జరుగుతుందని అన్నారు.
Post A Comment: