మన్యం మనుగడ వాజేడు. 5వ షెడ్యూల్ ప్రాంతంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ప్లాట్లు చేసి భూదందా చేస్తున్నా వారిపై 1/70 మరియు ఎల్ టి ఆర్ కేసు నమోదు చేసి అట్టి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆదివాసి నిరుపేద కుటుంబాలకు ఇవ్వాలని చట్టం చెప్పుతున్న ప్రభుత్వ భూములపై ఆక్రమణ జరుగుతూనే ఉంది. నిర్మాణాలు చేపడుతూనే ఉన్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాల నిర్మాణాలు, మూడు ప్లాట్లు ఆరు అపార్ట్మెంట్లు గా జరుగుతుందని చెరుకూరు పంచాయతీ సర్పంచ్ కుర్సం. అనంత అన్నారు. ఈ ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేయాలని చెరుకూరు గ్రామస్తుల సహాయంతో సర్పంచ్ కురసం అనంత నిలిపివేశారు. తదనంతరం రెవెన్యూ అధికారులకు చరవాణిలో సమాచారం ఇవ్వగా ప్రభుత్వ భూమిని బోర్డు పెట్టారు.
Post A Comment: