మన్యం టీవీ చర్ల:
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య కాల్పులు భీకరంగా జరిగినాయి. ఈ కాల్పులు చర్ల మండలానికి 25 కి.మీ దూరంలోని కుర్ణవల్లి, పెసలపాడు అటవీప్రాంతంలో ఈ ఉదయం 6 నుంచి 7.30గంటల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. మృతిచెందిన ఆరుగురిలో నలుగురు మహిళా మావోయిస్టులున్నారు. ఎదురుకాల్పుల్లో చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు మృతిచెందినట్లు సమాచారం.
Post A Comment: