మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, డిసెంబర్ 22, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా జూలూరుపాడు కు చెందిన చండ్రనరేంద్ర కుమార్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ములకలపల్లి లో బుధవారం రైతు సంఘం రెండవ మహా సభ నిర్వహించారు. ఈ మహా సభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన చండ్ర నరేంద్ర కుమార్ గతంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గా, మండల కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పాటు బలమైన ప్రజా ఉద్యమాలు నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. దేశంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు తొత్తులుగా మారి, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ, రైతాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ధర్నాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని, ధాన్యం కొనుగోలు చేయకుండా రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, జిల్లా రైతాంగ సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని తెలిపారు.
Post A Comment: