CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి ఆపరేషన్లు విజయవంతం:విప్ రేగా కాంతారావు.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలో,రేగా విష్ణు మెమోరియల్, చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి ఆపరేషన్లు మొదటి విడతగా 50 మందికి విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. హైదరాబాద్ పుష్పగిరి హాస్పిటల్ లో గురువారం విజయవంతం గా ఆపరేషన్లు పూర్తి చేసుకొని,శుక్రవారం మణుగూరు చేరుకున్న 50 మంది ని విప్ రేగా కాంతారావు మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి మాట్లాడారు.అనంతరం వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, కార్యదర్శి బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, యువజన నాయకులు, సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: