CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎస్ఎఫ్ఐ 52 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ.

Share it:


మన్యం మనుగడ మంగపేట.

మంగపేట మండలం లోని రాజుపేట గ్రామంలో డెక్క జై కృష్ణ ఎస్ఎఫ్ఐ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా 52 వ,ఆవిర్భావ ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ ములుగు జిల్లా అధ్యక్షుడు తోకల రవి జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ కేరళ రాష్ట్ర రాజధాని అయిన త్రివేండ్రం అనే ప్రాంతంలో 1970లో అధ్యయనం పోరాటం నినాదాలతో స్వతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం అనే లక్ష్యాలతో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఏర్పడిందని అన్నారు. దేశంలో పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదుఅనే ఉద్దేశం తో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేక పోరాటాలు చేసిందని అన్నారు. పోరాటంలో భాగంగా అనేకమంది విద్యార్థి నాయకులు అమరులు అయ్యారు వారి ఆశయాలతో మరింత ముందుకు పోవాలని విద్యార్థులకు సూచన ఇచ్చారు. ఎస్ఎఫ్ఐ రవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం వల్ల అనేక మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతారని అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు తమ సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం ఈ విద్యావిధానం తీసుకు వచ్చారని అన్నారు. నూతన విద్యా విధానాన్ని ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తుందని అన్నారు. నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడి చివరకు విజయం సాధించారు అదే రీతిలో విద్యార్థులందరూ ఎస్ఎఫ్ఐ తో కలిసి నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే పెండింగ్ లో ఉన్న 3568 కోట్ల బకాయిలు విడుదల చేయాలని అన్నారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వం అందించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గ్రామ నాయకులు సదాశివరావు ,పవన్, కళ్యాణ్ ,సిరి, వెంకటేష్, సిద్దు తదితరులు పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: