ఇంటర్ విద్యార్థుల మరణాలపై స్పందించని విద్యా శాఖమంత్రిని తొలగించాలి..
ఆదివారం జరిగిన శ్రామిక భవనంలో ఎస్ఎఫ్ఐ పినపాక డివిజన్ కార్యదర్శి రామాటేంకి శ్రీను మాట్లాడుతూ.కరోనా కాలంలో పాఠాలు లేవు..!! పాఠాలు చెప్పడానికి లెక్చరర్ లేరు..!! కేవలం కార్పోరేట్ నారయణ, శ్రీచైతన్య, శ్రీగాయత్రి లాంటి విద్యాసంస్థల ర్యాంకుల కోసమే పరీక్షలు నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు..!! కేవలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 33% మాత్రమే ఉతీర్ణత సాధించారు. ఎంతో మౌది లక్షల రూపాయల ఫీజులు కట్టి నష్టపోయారు..!! తమ ఉపాధి కోల్పోయిన ఫీజులు మాత్రం ఆపలేదు. విద్యార్ధులకు న్యాయం జరగాలి..!!అందరిని మినీమం మార్కులతో పాస్ చేయాలి. ఎందుకంటే ఫెయిలైన విద్యార్ధులు ప్రస్తుతం రెండవ సంవత్సరం పాఠాలు వింటూ ,పరీక్షలు రాయాలి.ఫెయిలైన మొదటి సంవత్సరం పరీక్షలు రాయాలి. సైన్స్ విద్యార్థులు ఫ్రాక్టీకల్స్ రాయాలి.ఎంట్రన్స్ పరీక్షలు జెయియి, నీట్,ఎంసెట్ లాంటివి రాయాలి.ఇంత ఒత్తిడి ఎలా భరిస్తారు.. తక్షణమే విద్యార్ధులకు న్యాయం చేయాలి.. దాని కోసం జరిగే "రాష్ట్ర వ్యాప్త ఇంటర్ విద్యాసంస్థల బంద్" జయప్రదం చేయాలని.ఐక్యవిద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అన్ని అన్నారు.ఈ కార్యక్రమంలో వసంత్ సాగర్ సాయి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: