CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్ సుడిగాలి పర్యటన.

Share it:

  



మన్యం మనుగడ డిసెంబర్ 29. ఈరోజు వాజేడు మండలం లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన లు చేసిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ. ములుగు జిల్లా చైర్మన్ కుసుమ జగదీష్ . జగన్నాధపురం హై జంక్షన్ వద్ద వాజేడు తెరాస కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు, అక్కడినుంచి వాజేడు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. వాజేడు మండల హైస్కూల్ పిల్లలు ఎమ్మెల్సీ ,జడ్పీ చైర్మన్ , మరియు ప్రజాప్రతినిధులకు పూలతో స్వాగతం పలికారు. తర్వాత జిల్లా పరిషత్ స్కూల్ లో 20 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత వాజేడు నాగారం లో 5 లక్షలతో నిర్మించనున్న సి సి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు తర్వాత ఆరుగుంటపల్లి లో 5 లక్షలతో నిర్మించనున్న సి సి రోడ్డు కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోదె బోయిన బుచ్చయ్య తెరాస రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు వాజేడు వెంకటాపురం జెడ్ పి టి సి లు తల్లడి పుష్పలత పాయం రమణ ఎంపీపీ శ్యామల శారద వాజేడు మండల తెరాస అధ్యక్షులు పెనుమల్ల రామకృష్ణ రెడ్డి ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు రమణ రావు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పూసం నరేష్ కుమార్ ఎంపీటీసీలు గుడివాడ చంద్రశేఖర్ బి పార్వతి యాలం చిట్టి బాబు సర్పంచులు యాలం సరస్వతి వాసం మల్లేశ్వరి కోరం సాంబయ్య తెల్లం బుల్లేశ్వరావు భద్రాచలం నియోజకవర్గ సోషల్ మీడియా కార్యదర్శి జజ్జరి సత్యనారాయణ మండల నాయకులు తెరాస కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: