మన్యం టీవీ, అశ్వాపురం:నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని అశ్వాపురం సీఐ శ్రీనివాస్.మరియు ఎస్ ఐ రాజేష్ కోరారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ రోజు రోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఈనెల 31న రాత్రి మండల ప్ పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. బ్రీత్ అనలైజర్ లతో తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని, వీధుల్లోకి రావద్దన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ నిబంధనలు ఎవరు అతిక్రమించిన కఠిన చర్యలు తప్పవన్నారు.
Post A Comment: