మన్యం టీవీ చర్ల:
చర్ల మండల పరిధిలో గల లింగపురం గ్రామంలో ఈ రోజూ ఉదయం సుమారు 7 గంటల సమయం లో ఆ గ్రామా నివాసి అయిన ఉదయగిరి వసమతి నివసించే పూరిఇళ్ళు కు నిప్పు అంటుకొని ఇల్లు భయంకరమైన మంటలతో దగ్ధం అయిపోతున్న సమయంలో అట్టి కుటుంబీకులు పెద్ద పెద్ద కేకలు వేయడంతో గ్రామస్తులంతా అక్కడకు చేరుకుని మంటలను పూర్తి స్థాయిలో ఆర్పివేయడం జరిగింది.సంఘటన స్థలంలో కుటుంబీకులు మాట్లాడుతూ ఈ విధంగా చెబుతున్నారు... ఇంట్లో అమౌంట్ రెండూ లక్షలు రూపాయలు , బియ్యం బస్తాలు , గ్యాస్ పొయ్యి మరియూ సిలిండర్,కుట్టు మెషిన్, బీరువా, మంచాలు,కప్పుకుని దుప్పట్లు, బట్టలు కూడా మొత్తం కలిపోయాయని కుటింబికులు బాధ పడుతు బిక్కు బిక్కు మంటూ వివరించడం జరిగింది. రెక్కాడితే గాని డొక్కాడని
అట్టి వసమతి కుటుంబం,మాకు వెనక ముందు ఎవరూ లేరంటూ మాకు జరిగిన ఈ దారుణమైన పరిస్థితిని అర్ధం చేసుకుని ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె కోరింది.
Post A Comment: