మన్యం మనుగడ, పినపాక:
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో శ్రీవిద్య టెక్నో జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకుగాను 462 మార్కులు సాధించి అశోక్ రాష్ట్రస్థాయి ఆరో ర్యాంకు సాధించాడు. అదేవిధంగా రమ్య శ్రీ 458 , జ్ఞాన ప్రకాష్ 456, ఎం అర్చన 456 మార్కులు సాధించినారు. అలాగే ఎంపీసీ విభాగంలో 26 మంది విద్యార్థులు 400 మార్కులు పైగా సాధించారు. అలాగే నూరు శాతం ఉత్తీర్ణతను కళాశాల కైవసం చేసుకుంది . గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడం కేవలం శ్రీవిద్య కే సాధ్యం అని నిర్వాహకులు తెలిపారు. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులను శ్రీ విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నిరోషా రెడ్డి, రాధిక స్కూల్ కరస్పాండెంట్ మధుసూదన్ రెడ్డి, కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ రవి ప్రసాద్ రెడ్డి, అధ్యాపకులు చెన్నారెడ్డి, బాలకృష్ణ, ప్రభాకర్, రమణ, వెంకటేశ్వరరావు, వీరప్రసాద్ ,విజయకుమారి, రమేష్,సాయి ప్రియ, వీరూ నాయక్, కళాశాల సిబ్బంది అభినందించారు.
Post A Comment: