CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నిరుపేద బాధిత కుటుంబానికి మన ఆపద్భాందవులు ఫౌండేషన్ నిత్యావసర సరుకులు అందచేత.

Share it:

 



మన్యం టివి దుమ్మగూడెం:

మండలంలోని గౌరారం పంచాయతీ పరిధిలో గల లింగాపురం గ్రామంలోని అతి నిరుపేద కుటుంబానికి చెందిన మడకం కొండయ్య(35) అనే వ్యక్తి రెండు వారాల క్రితం అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి కన్నీటి పర్యాంతానికి కారణమైన విషయం పాఠకులకు విధితమే.ఇతని భార్య పేరు మడకం వీరమ్మ,వీరిరువురికి సంతానంగా ఇద్దరు ఆడపిల్లలు కలరు.ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ నిరుపేద కుటుంబం ప్రస్తుతం కన్నీటి పర్యాంతం అవుతూ దిక్కు తోచని స్థితిలో ఉన్నది.ఉండటానికి సరైన ఇల్లు లేదు.వ్యవసాయం చేసుకోవడానికి పెద్దగా భూమి లేదు.కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఇంతలో ఆయనకు ఏం కష్టం వచ్చిందో ఎవరికీ తెలియదు కానీ అతను ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమైన విషయం.ఈ విషయం ఎవ్వరికీ అంతు చిక్కట్లేదు.ఈ విషయమై స్థానికంగా గల బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ నిర్వాహకులు స్పందించి మన ఆపద్భాందవులు ఫౌండేషన్ నిర్వాహకులకు సమాచారం ఇవ్వగా స్పందించిన మన ఆపద్భాందవులు ఫౌండేషన్ వారు బిఎల్ఏ వారి ఆధ్వర్యంలో 50కేజీల బియ్యం,14రకాల నిత్యావసర సరుకులు,కొన్ని కూరగాయలు బాధిత కుటుంబానికి అందజేసి అండగా నిలబడ్డారు.ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ....అభాగ్యులకు అండగా నిలబడదాం మానవత్వాన్ని కాపాడుదాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు మడకం వీరమ్మ,బిఎల్ ఏ సభ్యులు శ్యామల వీరాస్వామి,కాక రమేష్,గ్రామస్థులు కారం వీరాస్వామి,సారయ్య,కన్నయ్య,ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: