మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం నేతాజీ నగర్ లో ప్రధానోపాధ్యాయునికి సమ్మెకు సంబంధించిన కరపత్రాన్ని మధ్యాహ్న భోజన కార్మికులు అందజేశారు.ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్
(ఏ ఐ టి యు సి )జిల్లా అధ్యక్షురాలు సామల రమ పాల్గొని మాట్లాడుతూ. మధ్యాహ్న భోజన కార్మికులు గత 20 సంవత్సరాలుగా, వెయ్యి రూపాయల,గౌరవ వేతనంతో వంట చేస్తూ వంట బిల్లులు సకాలంలో అందక, మార్కెట్ కు అనుగుణంగా ప్రభుత్వం ధరలు అందించక అనేక ఇబ్బందులకు గురి అవుతూ అప్పుల పాలు కావాల్సి వస్తుందని అన్నారు. అందుకే గౌరవ వేతనం, పెంచాలని,కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని,తదితర సమస్యల పరిష్కారం కోసం జనవరి 5వ, తేదీ నుండి,కార్మికులు సమ్మెలో పాల్గొనాలని అందులో భాగంగా ఉదయం 10 గంటలకు ములుగులో జరిగే సమ్మెలో జిల్లాలోని వంట కార్మికులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ప్రమీల,పల్కె మణెమ్మ,గుంటి సరోజన తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: