మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని వనదేవతలను దర్శించుకున్న ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దనసరి సీతక్క వనదేవతల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర అని,జాతరకు కోటికి పైగా దేశంలోని ప్రతి రాష్ట్రం నుండి భక్తులు అడవి తల్లుల ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తారని, కావున మేడారం జాతర సమయం సమీపిస్తున్నందున భక్తులు,పర్యాటకులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మేడారం పనులు జాతరలోపు పూర్తి చేయాలని సంబంధిత జిల్లా అధికారులను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి,పటేల్ శ్రీధర్ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు బానోత్ రవిచందర్,గుమ్మడి సోమయ్య,కె.రవీందర్ రెడ్డి,కుర్సం కన్నయ్య, తాడ్వాయి మండల అధ్యక్షుడు జాలపు ఆనంతరెడ్డి,సహకార సంఘ అధ్యక్షులు పులి సంపత్,బొల్లు దేవేందర్,చిదం చంద్రు,అజ్మీర శ్రీధర్,ఎండి. ముజాఫర్ హుస్సేన్,ఇర్ప సునీల్,అర్రేమ్ లచ్చు పటేల్, మాజీ ఎంపీటీసీ రాజు,సర్పంచ్ గడ్డం అరుణ,తండాల శ్రీను, సర్పంచ్ సనప సమ్మయ్య, అలుగుబెల్లి కన్నయ్య,అళ్లెం ప్రభాకర్,తండాల శ్రీనివాస్, భూషణబోయిన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: