మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండeలం లోని పినపాక గ్రామానికి చెందిన బూర శంకరయ్య గౌడ్-పద్మ ల కుమార్తె ధనలక్ష్మి వివాహానికి తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అదేవిధంగా సీతంపేట గ్రామంలో ఇటీవల మరణించిన పటేల్ పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమాలలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, ఆత్మ చైర్మన్ భద్రయ్య, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వాసు బాబు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: