మన్యం మనుగడ వాజేడు. ములుగు జిల్లా వాజేడు మండలం అయ్యవారిపేట ధర్మవరం గ్రామ పంచాయితీ లో జి టి ఎస్ ఎస్ క్రైస్తవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో500 మంది విద్యార్థులకు, సర్పంచ్ మడకం బెనినీ. తహశీల్దార్..అల్లం రాజు కుమార్.ఆర్ ఐ మురళి కృష్ణ. సరుకులు పంపిణీ చేశారు.
నిత్యవసర సరుకులు, పేస్టు ,స్వీట్స్, బొమ్మలు , రగ్గులు బియ్యం తదితర వస్తువులు ఇచ్చారు .ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అల్లం రాజు కుమార్, సర్పంచ్ బెనినీ మాట్లాడుతూ ,మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి నిరు పేద పిల్లలకు కష్టకాలంలో ఎటువంటి సహాయం అందిస్తున్న ,జి టి ఎస్ ఎస్ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ డాక్టర్ జాకబ్ ను అభినందించారు, ఇటువంటి క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలు ఉండడం, సంతోషకరమని ఏజెన్సీ ఏరియా లో ఉన్నటువంటి పేదలకు సహాయం అందించడం అభినందనీయమని కొనియాడారు , ఈ కార్యక్రమంలో ఆర్ ,ఐ మురళి కృష్ణ , పాస్టర్స్ ఇంచార్జ్ ఆర్ వి పౌలు,పాస్టర్ జాన్ విక్టర్ కర్ని లూకా, సురేష్ ,సిబ్బందిపిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: