CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదాస్సు....

Share it:

  



చండ్రుగొండ మన్యం మనుగడ ప్రతినిధి : సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని సఖి కేంద్రం ఇంచార్జి ఎస్సై రమాదేవి అన్నారు. గురువారం చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ... సెల్ ఫోన్ లో వచ్చే లింకులను ఓపెన్ చేస్తే బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు మాయమవుతుందని, పరిచయం లేని వ్యక్తులకు బాలికలు తమ ఫొటోలను పంపవద్దని, అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలన్నారు.ఫోన్ లో చాటింగ్ చేయటం వంటి పనులు చేయవద్దన్నారు. సెల్ ఫోన్ లో నుంచి మంచి మాత్రమే ఉపయోగించుకోవాలని, చెడుకు దూరంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితిలో 100 కు ఫోన్ చేసి పోలీస్ సహాయం పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో ఎస్సై రాజేష్ కుమార్, హెచ్ఎం మంజుశ్రీ, పీడీ గంగా ప్రసాద్, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, సఖి కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: