మన్యం టీవీ ఏటూర్ నాగారం
ఏటూర్ నాగారం మండల కేంద్రంలోని జంబోరి గ్రౌండ్ మైదానంలో గురువారం గ్రాస్ ఫుల్ పవర్ ట్రైబల్స్ సొసైటీ సర్వీస్ ఖమ్మం ఆర్వీ రామారావు,కంతి ఎలీషా బాబు ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు గిఫ్ట్ బాక్స్ లు ఐదు కేజీల బియ్యం దుప్పట్లు తినుబండారాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఈసం రామ్మూర్తి హాజరైనారు.మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 330 మంది విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు సామాగ్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు జిటి ఎస్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్స్ చలికాలం దృష్టిలో పెట్టుకొని దుప్పట్లు బియ్యం సామాగ్రి పంపిణీ చేయడం అభినందించదగిన విషయమని సంస్థ అందిస్తున్న సేవలను కొనియాడుతూ అభినందించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: