CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ శిబిరం:విప్ రేగా కాంతారావు.రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్లు.

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని వందపడకల ఆసుపత్రిలో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా డిసెంబర్ 29 తేదీ న బుధవారం ఉచిత కంటి ఆపరేషన్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.మంగళవారం మండలంలోని వంద పడకల ఆసుపత్రిని విప్ రేగా కాంతారావు సందర్శించి,కంటి పరీక్ష ఏర్పాటు పనులను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా మాట్లాడుతూ, నియోజకవర్గం ప్రజలందరూ ఉచిత కంటి ఆపరేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.2 వేల మందికి పైగా ఉచిత కంటి ఆపరేషన్ చేస్తారని ఈ సందర్భంగా వివరించారు.నియోజక వర్గం ప్రజలందరూ హాజరై ఉచిత కంటి ఆపరేషన్ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నరసింహారావు, పీఏసీఎస్ కుర్రి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు అడపా అప్పారావు,కార్యదర్శి నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,టీఆర్ఎస్ నాయకులు వట్టం రాంబాబు,ముద్దంగుల కృష్ణ,పార్టీ సీనియర్ నాయకులు,యువజన నాయకులు బోశెట్టి.రవి ప్రసాద్,గుర్రం.సృజన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: