మన్యంటీవి, అశ్వారావుపేట: త్వరలో అశ్వారావుపేట పట్టణంలో నిర్మించనున్న కొమురం భీం భవనానికి మొదటి విరాళంగా 50,116/- పండు వారి గూడెం గ్రామానికి చెందిన పెను మచ్చ సత్యనారాయణ మల్లాయిగూడెం గ్రామం లో మాజీ సర్పంచ్ ధార ప్రసాద్ ఇంటి వద్ద అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ సమక్షంలో కమిటీ మెంబర్లకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ మెంబర్స్ ఆదివాసీ గిరిజనుల తరపున పెనుమెచ్చ సత్యనారాయణరాజు కి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ పూనెం వెంకటస్వామి, పొట్టా రాజులు, పాయం దుర్గారావు, కట్రం స్వామి, కంగాల ఆదినారాయణ, సోయం రామూర్తి, తాటి పోతురాజు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: