మన్యం టీవి, మణుగూరు:
కియో జపాన్ షాటోకాన్ కరాటే అసోసియేషన్ హైదరాబాద్ (kio Japan shotokan karate association Hyderabad) నిర్వహించిన నేషనల్ కరాటే టొర్నమెంట్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కు చెందిన షిటోరియో జపాన్ కరాటే డూ ఇండియా హంబూ సంస్థ కి చెందిన ఆరుగురు విద్యార్థులు పాల్గొని 5 బంగారు పతకాలు 1 వెండి పతకం సాధించినట్లు సంస్థ చీఫ్ ఇన్స్ట్రక్టర్ లు డేగల ప్రశాంత్ , కాశిమల్ల. పద్మ తెలిపారు. ఈ పోటీలలో అస్సాం, పంజాబ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుండి 450 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. ఇందులో 12 సంవత్సరాల విభాగాములో పల్లవి, విగ్నేష్ మరియు 9 సంవత్సరాల విభాగములో మిధుల శ్రీ, డిషిత, క్రిష్ణ శ్రీ మరియు 15 సంవత్సరాల విభాగంలో చరణి బంగారు పతకాలు సాధించారు. వీరిని షిటోరియో జపాన్ కరాటే డూ ఇండియా హంబూ సంస్థ చీఫ్ టిక్నికల్ డైరక్టర్ & ఎగ్జామినర్ షిహాన్: రచ్చశ్రీను బాబు black belt 6th don అభినందనలు తెలియ జేశారు.
Post A Comment: