మన్యం టీవీ మంగపేట.
18/12/2021 రాత్రి సమయంలో బీమనపల్లి ప్రశాంత్ (26) తండ్రి దేవాదాసు సిరిసిల్లాకు చెందిన వ్యక్తి మరి కొంతమంది అతని స్నేహితులు కలిసి TS02FF8850 నెంబర్ గల ఎర్టిగా కారులో సిరిసిల్ల నుండి బయలు దేరి మణుగూరు లోని తమ స్నేహితుని వివాహానికి వెళ్తుండగా మార్గ మధ్యలో 20/12/2021 తెల్లవారుజామున సుమారు 04:15 నిముషముల సమయం లో మంగపేట లోని ప్రభుత్వ గిడ్డంగి దగ్గర కారు అతి వేగం లో అదుపు తప్పి పక్కన కల్వర్టు గుద్దుకోగా కారులో ప్రయాణిస్తున్న ప్రశాంత్ (26) కాళ్లకు చేతులకు గాయాలు అయి చనిపోయాడు మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయినవి. ఇంతటి ప్రమాదానికి కారణం డ్రైవర్ మంచికట్ల శ్రీకాంత్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ లో అతి వేగమే కారణం అని కేసును దర్యాప్తు చేస్తున్న మంగపేట ఎస్ ఐ తాహెర్ బాబా తెలియజేశారు .
Post A Comment: