మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలములో తిమ్మoపేట కాంగ్రెస్ పార్టి గ్రామ కమిటి అద్యక్షులు చిన్నపెళ్లి రాంబాబు ,ప్రధానకార్యదర్శి బోడ బోర్రయ్య ఆద్వర్యములో 137వ, జాతీయ కాంగ్రెస్ పార్టిఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పార్టి జెండాను అద్యక్షులు రాంబాబు ఎగరవేశారు. ముఖ్య అతిధిలు ఉమ్మడి జిల్లా అద్యక్షులు పూజారి సురేంధర్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాద్యక్షులు చిలకమర్రి శ్రీనివాస్ హాజరయ్యారు.జిల్లా నాయకులు దిగొండ కాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టి యావత్ దేశానికి చేసిన సేవ ఎనలేనిది అని ఈ రోజు గ్రామాలలో అభివృది జరిగినది అంటె అది కాంగ్రెస్ తో జరిగింది అని తెలిపారు. ఇప్పుడు ఉన్న ఉన్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లు తప్ప పేద ప్రజలకు ఎవరు చేసింది ఏమి లేదు. ఇస్తాను అన్న డబల్ బెడ్ రూమ్ లు లేవు ఇంకా గ్రామాల లో సరి అయిన రోడ్లు లేవు. ఈ కష్టాలు తొలగి పోవాలంటే జరుగబోయే ఎన్నికలలో అటు దేశంలో ఇటు రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే నని ప్రతి కార్యకర్ర కష్టపడి పనిచేసి పార్టిని ముందుకు తీసుకపోవాలని తెలిపారు.ఈ కార్యక్రమములో మండల ప్రధానకార్యదర్శి మైప లాలయ్య, మండల కిసాన్ సెల్ కార్యదర్శి చిన్నపెళ్లి స్వామి, మండల మీడియ ఇంచార్జ్ బసారి నాగార్జున, సినియర్ నాయకులు ఆక సత్యనారయణ, ఆక వెంకటరావు,గ్రామ ఉపాద్యక్షులు దుర్గం బిక్షపతి, గ్రామ కిసాన్ సెల్ ప్రధానకార్యదర్శి ముండ్రాతి సాంభయ్య, యస్ సి సెల్ గ్రామ అద్యక్షులు గోనె నాగేశ్, మండల ఉపాద్యక్షులు బోడ రవి,యస్ సి సెల్ మండల ప్రధానకార్యదర్శి దుర్గం శివప్రసాద్, నాయకులు చిలక కమర్రి వేణు, బసారి హరిక్రిష్ణ, మద్దిరాల కనకం, ఆలం నర్సింహారావు, బోడ రామచంద్రo, ముప్పారపు నర్సింహారావు, పూజారి రాజాలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: